వృద్దురాలి అంత్యక్రియల్లో వెల్లివిరిసిన మత సామరస్యం..

వృద్దురాలి అంత్యక్రియల్లో వెల్లివిరిసిన మత సామరస్యం.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో మత సామరస్యం వెల్లివిరిసింది. చనిపోయిన ఓ 80 ఏళ్ల హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ముస్లిం యువకులు ముందుకొచ్చారు. తల్లిలా ప్రేమించే ఆమె పాడెను మోసుకుని వెళ్లి హిందూ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుని శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు.