ప్రతి ఏటా శివరాత్రి జాగరణ సమయంలో నాగేంద్రుడు ప్రత్యక్షం

శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహా శివరాత్రి పర్వదినం రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. భోలాశంకరుడిని, నాగు పాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనం ఇచ్చింది.