చంద్రబాబును కొత్తగా పొగుడ్తున్నా అనుకోవద్దు.. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి

విశాఖపట్నం, జూన్ 10: రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు.