టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ రీసెంట్ గా డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.. టాలీవుడ్ లో మేము టాలీవుడ్ లో వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతాం అని ఎస్కె ఎన్ అన్నారు. అంతే కాదు దానికి కారణం కూడా ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది అని అన్నారు. ఇక నుంచి నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగురాని హీరోయిన్లని తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఎస్కేఎన్ తెలిపారు. ఈకామెంట్స్ వైరల్ గా మారడంతో విమర్శలు కూడా వినిపించాయి.