నిర్మాణంలో ఉన్న భవనానికి ముందు ఏర్పాటు చేసిన భారీ ఇనుప గేటు ప్రమాదవశాత్తు పడిపోవడంతో దుంపల గ్రామానికి చెందిన ఆకాష్ అనే ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన ఆకాష్ తన తాతయ్య, అమ్మమ్మల దగ్గరకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వారు ఆ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఉదయం ఆకాష్ భవనం ప్రాంగణంలో ఆడుకుంటూ గేటు దగ్గరకు వెళ్లగా, ఆకస్మాత్తుగా గేటు కూలిపడటంతో బాలుడు దానికింద నలిగిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని బయటకు తీసి, సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.