అక్కడ ఆరు గంటలైతే అంతా నిశ్శబ్దం..!

అమ్మో చిరుత.. అదిగో చిరుత.. ఇదే ఇప్పుడు తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో వినిపిస్తున్నది. కనిపిస్తున్న హెచ్చరిక అదే..! వణికిస్తున్న చిరుతల సంచారం వేద విద్యార్థులనే కాదు సిబ్బంది వెన్నులోనూ వణుకు పుట్టిస్తున్న భయం. తరచూ కంటపడుతున్న చిరుతల పని పట్టే పనిలో బోన్లు ఏర్పాటు చేసి ఆపరేషన్ చిరుత చేపట్టింది ఫారెస్ట్ యంత్రాంగం. కానీ 20 రోజులుగా దడ పుట్టిస్తున్న చిరుతల సంచారం మాత్రం కంటి మీద కునుకులేకుండా చేసింది.