సెల్ఫీ తీసుకుని చిరుత ముందు యువకుల కవ్వింపులు..

మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌ అటవీ ప్రాంతంలో పిక్నిక్‌ వెళ్లిన యువకులు చిరుతతో చెలగాటమాడారు. సోన్‌ నది తీరంలో పిక్నిక్‌ చేసుకుంటుండగా చెట్ల దగ్గర వాళ్లకు చిరుతపులి కనిపించింది. తమ సెల్‌ఫోన్లలో చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు చిరుతను దగ్గర రమ్మంటూ పిలిచారు. మరింతగా కవ్వింపులకు దిగారు. కాని చిరుతకు వాళ్ల తీరు చూసి చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ముగ్గురిపై దాడి చేసింది. చిరుత దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. చిరుతను రెచ్చగొట్టి రీల్స్‌ చేసే ప్రయత్నంలో వాళ్లు గాయపడ్డారు.