వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. ఆ రైతు పశువుల కొట్టంలో క్షుద్ర పూజలు నిర్వహించిన గుర్తు తెలియని వ్యక్తులు.. పరిసర ప్రాంత రైతులంతా హడలెత్తి పోయేలా చేశారు. పిండితో మనిషిబొమ్మను తయారుచేసి ఆ బొమ్మకు క్షుద్రపూజలు నిర్వహించారు.