డ్రోన్ సహాయంతో గణపయ్య నిమజ్జనం

తూర్పుగోదావరి జిల్లా పూల కడియపులంక లో వినూత్నంగా డ్రోన్తో బాలగణపతి విగ్రహ నిమజ్జనం నెట్టింట వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యను కొంతమంది చిన్నారులు ఇలా నిమ జ్జనం చేశారు. స్థానిక స్నానాలరేవు వద్దకు పిల్ల లను అనుమతించకపోవడంతో వారు ప్రత్యా మ్నాయాన్ని ఆలోచించారు.