ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ కొరడా

ఎల్బినగర్ చింతలకుంట వద్ద ఆర్టిఏ అధికారుల తనిఖీలు నిర్వహించారు.నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రవేట్ ట్రావెల్స్ బస్సుల పై కేసులు నమోదు చేశారు.పలు ట్రావెల్స్ కి చెందిన బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పాటించని బస్సుల యాజమాన్యాలను ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. నిబంధనలను పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.