ఓటుకు రెడీ అంటున్న వందేళ్ల బామ్మ.. ఎన్నికలపై ఆమె ఏం చెబుతున్నారో తెలుసా..?

నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన చివాటే అన్నపూర్ణబాయి..వయసు104 సంవత్సరాలు. ఈ నెల 30 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతుంది. 1957 నుండి ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నానని తెలిపింది ఆ వృద్దురాలు. ప్రాణమున్నంత వరకు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది ఈ బామ్మ.