ప్రభుత్వాసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం..!

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టిస్తోంది. ఆసుపత్రి కారిడార్‌లో తండ్రితోపాటు నిద్రిస్తున్న బాలుడు కనిపించకపోవడం సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాక్లూర్ మండలం మానిక్ భండార్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రసూతి కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితోపసాటు ఆస్పత్రి కారిడార్‌లో నిద్రించాడు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి వద్ద నిద్రిస్తున్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్ర లేచిన బాలుడి తండ్రి తన పక్కలో ఉండాల్సిన బాబు కనిపించక పోయేసరికి కంగారుపడ్డాడు. ఆస్పత్రి పరిసరాల్లో ఎంత వెతికినా జాడ కనిపించలేదు.