పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటుచేసిన అనంత పద్మనాభస్వామి గణనాధుడు విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. పార్వతీపురం పట్టణంలోని మోటుపర్తి వారి వీధిలో గణేశ నవరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. కమిటీ సభ్యులు ఈ ఏడాది వినూత్న ఆలోచనతో అనంత పద్మనాభ స్వామి రూపంలో గణపయ్యను ప్రతిష్టించారు.