కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆ సేతు హిమాచలం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణపతాకాన్ని ఎగరవేశారు. జాతి నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాక రెపరెపలాడుతున్నాయి.. దేశభక్తి గీతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మరోవైపు దేశ భక్తిని తమకు తోచిన రీతిలో ప్రదర్శిస్తున్నారు కొందరు. స్వాతంత్య దినోత్సవాన్ని పురష్కరించుకుని పిఠాపురంలోని కృష్ణయ్య ఆలయాన్ని త్రివర్ణ రంగులతో అలంకరించారు,