మృతి చెందిన శునకానికి పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు

మృతి చెందిన శునకానికి పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు గోల్డీ 2016 బ్యాచ్ అధికారి.. ఇటీవల అనారోగ్యంతో చనిపోతే నిజామాబాద్ జిల్లాలో పోలీసులంతా కంట తడి పెట్టారు. నివాళ్ళు అర్పించారు. విశిష్ట సేవలను గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఎవరూ అనుకుంటున్నారా..? అదొక స్పెషల్ డాగ్..! నిజామాబాద్ జిల్లా పోలీస్ విభాగంలో పనిచేసి అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. మందుపాతరలు గుర్తు పట్టే శునకం.. నిజామాబాద్ రేంజ్ పోలీసులతో పని చేసేదీ. ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయింది. దీంతో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బ్యాండ్ వాయించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. అదనపు డీసీపీ అడ్మిన్ కోటేశ్వర్ రావు నివాళులు అర్పించారు.