ఇంద్రకీలాద్రికి పోటెత్తుతోన్న మహిళా భక్తులు

ఆగష్టు 4వ తేదీ వరకూ అమ్మవారికి ఆషాఢ మాసం సారె అందజేయనున్నారు. ఈ క్రమంలోనే.. అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడానికి భారీగా తరలివస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇస్తున్నారు. ఇక.. ఆషాఢ మహోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారికి కూడా ఆషాఢం సారె సమర్పించారు మహిళలు