Nizamabad: Women fight for seat in A Bus Is Video Went Viral

అసలే పండగ సీజన్‌.. సంక్రాంతి పండగన నేపథ్యంలో ప్రజలు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లకు దిగుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలు గొడవపడ్డారు. ముధోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో భైంసా నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ల కోసం సిగలు పట్టుకుని కుమ్ముకున్నారు. సీటు కోసం ఆడవాళ్లు దారుణంగా కొట్లాడుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.