కాలువల్లో , నీరు ఎండిపోయిన మడుగుల్లో మట్ట గుడిసెలు, కోరమీనులు దొరుకుతాయి. వీటి కోసం బురదలో దిగి ఒక వృద్ధుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏలూరు నగరానికి చెందిన బాజీరావు అనే వృద్ధుడు స్థానిక ఓవర్ బ్రిడ్జి వద్ద నివాసం ఉంటున్నాడు. కాలువల్లో దిగి చిన్న చిన్న చేపలు, నత్తలు, పట్టుకుని వాటిని అమ్మి పొట్ట నింపుకుంటుంటాడు. రోజూ లాగే చేపల వేటకు బయలు దేరాడు. అయితే ఈసారి అతనికి ఊహించని షాక్ తగిలింది.