లష్కర్ బోనాలతో సికింద్రాబాద్‌లో ఆధ్యాత్మిక శోభ

అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం… ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. లష్కర్ బోనాలు... భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారు జామునుంచి లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి. తలంటు స్నానం చేసి. వ్రతం ఆచరించి, భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి మొక్కు తీర్చుకుంటున్నారు భక్తులు. . మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు.