తిరుమలకు పయనమైన మాధవీలత రైలులో గోవిందుడిభజనలు చేస్తున్న భక్తబృందం

లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి శ్రీవారిని తలచుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటారు. అంత పవిత్రంగా భావించి స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ అనే సంచలన ఆరోపణలతో యావత్ హిందు సమాజం ఉల్కి పడింది. ప్రస్తుతం రాజకీయ రంగుని పులుముకుంది. రాజకీయ నేతలు, ప్రముఖులు ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణ బిజేపీ మహిళా నేత మాధవీలత స్పందించారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు పయనం అయ్యారు.