'తాగుబోతు మనసు చూస్తూ ఆగలేకపోయింది సార్‌..' మద్యం సీసాలతో పరార్

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా కొందరు మందుబాబులు వాటిని చేతబూని ఉడాయించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కొద్ది నిమిషాల పాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఏకంగా పోలీసుల కళ్లెదుటే మందుబాబులు మద్యం సీసాల కోసం ఎగబడటం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.