AP Elections 2024 | పోస్టల్‌ బ్యాలెట్లపై గందరగోళం అవసరం లేదు : CEO Mukesh Kumar Meena - TV9

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంశంపై ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా సంతకం ఉంటే.. ఓటు చెల్లుబాటు అవుతుందన్న రూల్‌ని వైసీపీ తప్పుబడుతోంది. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను కోరింది.