మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దు గ్రామాలను చిరుత పులుల దాడులు వణికిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ), తిర్యాణి మండలాలను చిరుత సంచారం వణికిస్తోంది. అటు మహారాష్ట్రాలోను చిరుత పులుల దాడులు నిత్యకృత్యంగా మారాయి. అయితే చిరుత దాడుల నుండి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు మహారాష్ట్ర వాసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తాతల కాలం నాటి కఠిన ఆచారాన్ని పాటించి తమ ప్రాణాలు నిలుపుకునేందుకు సిద్ధమయ్యారు.