జోగులాంబ ఆలయం... దేశంలోనే ఐదో శక్తిపీఠం. ఇంతటి ప్రసిద్ధ క్షేత్రంలో ఆలయ పాలన అస్తవస్త్యంగా మారింది. అర్చకులు, ఆఫీసర్లపై ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆలయంలో అన్ని తానై చక్రం తిప్పుతూ ఓ పూజారి ఎకంగా ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే... అందినకాడికి దోచుకుంటున్నాడని ఈవోపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చి కొంగుబంగారంగా నిలుస్తున్న అలంపూర్ క్షేత్రాన్ని అర్చకులు, అధికారులు ఆగం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.