పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా పెద్దపులిని చూశారు రైతు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి రోడ్డు దాటుతున్న ప్రదేశం వద్ద పెద్దపులి పాదముద్రలను గుర్తించి పై అధికారులకు సమాచారం అందించారు సిబ్బంది. జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య సంఘటన స్థలంలో పులి పాదముద్ర చూసి ఆడపులిగా గుర్తించారు. గోపాల్ పూర్ అడవి ప్రాంతం నుంచి కాకర్లపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు పులి అడుగులను చూసి అంచనా వేశారు.