రాత్రికి రాత్రీ 90 ఏళ్ల నాటి చెట్లను నరికేసిన అన్నదమ్ములు..సెంటిమెంట్ రీజన్ వింటే షాక్ తినాల్సిందే..

ఈ చెట్లునాటి సుమారు 90 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే శనివారం రాత్రి సమయంలో గ్రామానికి చెందిన కురువ లింగప్ప, కురువమల్లయ్య, కురువ రామచంద్ర, కుడుము భీమయ్య, గడ్డం భీమయ్య, బంగారు భీమయ్య అనేవ్యక్తులు రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు రాఘవరెడ్డి విలేకరులకు తెలిపారు. అంతకుముందు రోజు అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని గ్రామస్తులను హెచ్చరించారు.