కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మాజిద్ అలీ అనే యువకుడు వినూత్న ప్రయత్నం చేసి భళా అనిపించుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ వేళ పిండి గిర్ని కష్టాలకు తనదైన స్టైల్ లో చెక్ పెట్టి… మారుమూల పల్లెల్లో ఇంటి వద్ద పిండిగిర్ని తెచ్చి మహిళల పిండి వంటల కష్టాలను తీర్చేశాడు. తన వద్ద ఉన్న బైక్ నే పిండి గిర్ని గా మార్చేసి.. శభాష్ అనిపించుకుంటున్నాడు.