శ్రీకాకుళం జిల్లాలో భారీ స్థాయిలో విదేశీ పక్షుల అక్రమ రవాణా బయటపడింది. పలాస–కాశీబుగ్గ రేంజ్ అటవీశాఖ అధికారులు దాడి చేసి 236 అరుదైన పక్షులను స్వాధీనం చేసుకున్నారు. కలకత్తా నుంచి చెన్నైకి తరలిస్తుండగా పట్టుబడ్డ ఈ పక్షుల విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.