మంత్రుల సాక్షిగా ఖమ్మం కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఖమ్మం పార్లమెంట్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలోనే రగడ కొనసాగింది.