మేడారానికి పోటెత్తిన భక్తులు.. 3 లక్షల పైగా భక్తులు వస్తారని అంచనా..

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. మేడారం మహాజాతర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. దానిలో భాగంగా.. నాలుగు రోజులు ముందుగానే మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్‌ఆర్టీసీ. ఆదివారం నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు.. ఖమ్మం రీజియన్ నుండి 494 సర్వీసుల ఏర్పాటు చేశారు.