నీళ్లలో దూకిన మహిళ.. ప్రాణాలకు తెలగించి ఎలా కాపాడాడంటే..

ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన మహిళను కాపాడాడు ఒక ఆలయ అర్చకుడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మల పాలెం గ్రామానికి చెందిన మహిళ ఇబ్రహీంపట్నంలోని విటిపిఎస్ కెనాల్‎లో దూకి ఆత్మ హత్యాయత్నం చేశారు. అయితే అటుగా వెళ్తున్న అదే ప్రాంతానికి చెందిన ఆంజనేయ స్వామి ఆలయం ప్రధాన అర్చకుడు రవిదత్తా మహిళ కాలువలో దూకడం గమనించాడు.