తమిళనాడులో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలోఉన్న ప్లైఓవర్

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. తిరుపత్తూరు జిల్లాలో అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ప్లైవర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించి శిథిలాలను తొలగించారు.