ఓటు విలువ గుర్తెరుగని వారికి ఈ గిరిపుత్రులే స్ఫూర్తి..!

ఓటు విలువ గుర్తెరుగని వారికి ఈ గిరిపుత్రులే స్ఫూర్తి..! ఇళ్లలో నుండి బయటకు రాని ఓటర్లు.. ఓటు విలువ గుర్తించని వారికి ఈ గిరిజనులే స్ఫూర్తి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 కి.మీ నడిచారు. మండు టెండలో కొండలు దాటుకుంటూ, వాగులు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగం చేసుకున్నారు. మైళ్ళ దూరం కాలినడకన వచ్చి ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్న వారిని అధికారులు, రాజకీయ నేతలు అభినందించారు..