శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం..

జాతుల, భాషల చరిత్రకి నమ్మకమైన భౌతిక ఆక్షరాల్లో శాసనాలు ముఖ్యమైనవి. శిలా శాసనాల్లో కనిపించే విషయాలను మనవాళ్లు ప్రామాణిక సత్యాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా జ్యోతిర్లింగం శక్తిపీఠం కొలువైన శ్రీశైల మహా క్షేత్రంలో 14వ శతాబ్దం నాటి శిలాశాసనం, అతి పురాతన శివలింగం బయటపడ్డాయి. దీంతో శివ భక్తులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.