సిరిసిల్ల బస్టాండ్‌లో కాకుల అటాక్.. మగవారే టార్గెట్!

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద కాకులు హల్‌ చల్‌ చేస్తున్నాయి. బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మపై వాలుతున్నాయి. కట్ట మైసమ్మ గుడి ఆనుకొని ఉన్న వేప చెట్టుపై పదుల సంఖ్యలో కాకులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. కాకుల గూడు నుంచి ఒక కాకి పిల్ల కింద పడిపోవడంతో.. చెట్టు కింద నుంచి నడుస్తున్న మగ వాళ్లు టార్గెట్‌గా వారిపై దాడి చేస్తున్నాయి. కాకులు దాడి చేస్తున్నాయన్న విషయం కొందరికి మాత్రమే తెలియడంతో ఆటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బస్టాండ్ కావడంతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఆటు వైపు వెళ్లడంతో వారిపై దాడి చేస్తున్నాయి.