జనగాం జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో వాకర్స్ చేపల వేటలో నిమగ్నమయ్యారు. బతుకమ్మ కుంటలో నీటిమట్టం అడుగంటడంతో వాకింగ్ కి వచ్చిన వాళ్లకు చేపలు పైన తేలియాడుతూ కనిపించాయి. చెరువు నిండుగా చేపలు పై పైనే కనిపించటంతో జనాలు ఆగుతారా..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కుంటలోకి దిగి చేపలు పట్టే పనిలో మునిగిపోయారు. పట్టుకున్న వాళ్లు పట్టినన్నీ చేపలు ఇంటికి మోసుకెళ్లి చేపల పండగ చేసుకున్నారు.