ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి వేడుకలను ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో సహా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సైతం హాజరయ్యారు.. ఈ వేడుకల్లో పాలూరులో శంకర్ తయారు చేసిన ఎద్దుల బొమ్మలను ప్రదర్శనలో ఉంచారు. ఇవే అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.