ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందారు. లువాలాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు.