తిరుమల రెండో ఘాట్ రోడ్డులో తృటిలో తప్పిన పెను ప్రమాదం.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమ‌ల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్తున్న లాడీ బోల్తా పడి పిట్టగోడను అనుకుని ఆగిపోయింది. ఫుల్ లోడ్ తో కొండ‌పైకి వెళ్తున్న లారీ నుంచి చక్రాలు విడిపోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.