పుణెలోని మెట్రో స్టేషన్‌లో అగ్నిప్రమాదం

మహారాష్ట్ర పుణెలోని ఒక మెట్రో స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మెట్రోస్టేషన్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి.