ఢిల్లీ సివిల్స్‌ విద్యార్థులు మృతి.. ప్రమాదానికి ముందు జరిగిన దృశ్యాలు

ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్ర నగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో శనివారం అనూహ్యంగా వరదలు రావడంతో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా వరద నీరు పోటెత్తడంతో పలువురు ఐఏఎస్ అభ్యర్థులు బేస్‌మెట్‌లో చిక్కుకుపోయారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ బేస్‌మెట్‌లో అక్రమంగా లైబ్రరీని ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో విద్యార్ధులు నిరసనలు మిన్నంటాయి.