తీరం దాటిన వాయుగుండం.. అక్కడ అతి భారీ వర్షాలు..!

దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం దడపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వానగండం పొంచి ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడపజిల్లాలను ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వార్నింగ్ వణికిస్తోంది.