ఎన్నో ఏళ్ల కల సాకారమైన వేళ..ఆ గ్రామస్థులు కలెక్టర్‎కు ఇచ్చిన బహుమానం ఇదే..

ఎన్నో ఏళ్ల కల సాకారమైన వేళ..ఆ గ్రామస్థులు కలెక్టర్‎కు ఇచ్చిన బహుమానం ఇదే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల సమయాల్లో వంతెనలు లేక గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు వివిధ గ్రామాల ప్రజలు. వరద సమయంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. తమ ఇబ్బందులను పలుసార్లు పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. లంక గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు పెద్దపీట వేశారు. స్థానిక మండల పరిధిలోని మామిడి కుదురు- అప్పనపల్లి మార్గం మధ్యలో కొర్లకుంట వద్ద శిథిలా వస్థకు చేరిన వంతెనను జిల్లా పర్యటనలో గుర్తించారు. దీంతో పాటు సుమారు నాలుగు గ్రామాలకు రవాణా సౌకర్యాల్లో తీవ్ర అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. వీటి అభివృద్ది పనుల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.