భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న ఢిల్లీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక కోచింగ్ సెంటర్ ముగ్గురు విద్యార్థుల బతుకులను సమాధి చేసింది. అదేదో మామూలు కోచింగ్ సెంటర్ కాదు. ఏకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్. IAS, IPS కావాలని కలలు కనే వారు కోచింగ్ తీసుకునే సెంటర్ అది. కానీ ఆ సెంటర్.. రూల్స్కు పాతర వేసింది. అది విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. 7 గంటల సమయంలోనే తాము నీటిలో చిక్కుకున్నామంటూ పలువురు అభ్యర్థులు ఫైర్ స్టేషన్కు కాల్ చేశారు. కాని ఫైర్ సిబ్బంది రాడానికి ఆలస్యమైంది. ట్రాఫిక్ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా రావడంతో.. అప్పటికే నీటిలో చిక్కుకున్న వారిలో ఒకరు చనిపోయారు.