సీఎం రేవంత్ సొంత జిల్లాలో అక్రమ నిర్మాణాల నేలమట్టం..!

హైడ్రా తరహా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు పాలమూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గత అర్థరాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. క్రిస్టియన్ పల్లికి సమీమలోని సర్వే నంబర్ 523లో సుమారు 70కి పైగా ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ అర్దరాత్రి తర్వాత ఈ కూల్చివేతలు జరిపారు. భారీగా పోలీసులు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది సహకారంతో జేసీబీలతో ఇళ్ళను కూల్చివేశారు. అర్దరాత్రి దాటిన తర్వాత మొదలైన కూల్చివేతలు తెల్లవారుజామున వరకు కొనసాగాయి.