వరంగల్ జిల్లాలో సరదా ప్రయాణం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు ఓ కారు ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఓ కుటుంబం మొత్తం గల్లంతయ్యింది. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ అతని భార్య, కుమార్తె, కుమారునితో కలిసి కారులో వెళ్తున్నారు. సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పింది. దీంతో నేరుగా SRSP కాలువలోకి దూసుకెళ్లింది కారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.