చదివింది ఏడు.. రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న కేటుగాడు..!

వాళ్లు మహా మాయగాళ్ళు.. చదివింది ఏడో తరగతి కానీ చేసిన పని రాష్ట్రాన్ని షేక్ చేసింది.. నకిలీ అటవీ హక్కు పత్రాలు ముద్రించి అటవీ భూములకు ఎసరు పెట్టారు.. అంతేకాదు వాటిని బ్యాంక్ లో తనఖాపెట్టి లక్షలాది రూపాయల రుణాలు పొందారు. వరంగల్ కేంద్రంగా సాగిన ఆ నకిలీ అటవీ హక్కు పత్రాల హైటెక్ రాకెట్ ఇప్పుడు రెవెన్యూ, అటవీశాఖను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.