అమానుషం.. నడిరోడ్డులో వ్యక్తిపై విచక్షణారహిత దాడి..

మేడ్చల్ జిల్లా సెంటర్ అల్వాల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో జరిగిన ఈ దుర్మార్గమైన ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తమ ఇంటి ముందు మూత్రం పోశాడనే నెపంతో అదే కాలనీలోనే ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య రాద్ధాంతం చోటు చేసుకుంది. అయితే గొడవకు ఎవరైతే దిగారో.. ఆ వ్యక్తి ఫోన్ చేసి మరీ బోయిన్‌పల్లి ప్రాంతం నుంచి మరో ఇద్దరిని పిలిపించాడు. అనంతరం ,మూత్రం పోశాడని ఆరోపణలు ఉన్న వ్యక్తి మీద విచక్షణారహితంగా దాడి చేశారు.