నక్కలు ఆపదలో పడ్డాయి.. ఏం జరిగిందంటే

వన్య ప్రాణుల్లో స్పెషలిస్టుగా పేరొందిన ఆ జీవులు కష్టాల్లో చిక్కుకున్నాయి. జిత్తుల మారి తెలివి తేటలతో వనాల్లో తిరుగాడు జంతువులను ముప్పు తిప్పలు పెట్టే నక్కలు ఆపదలో పడ్డాయి. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రాణాలకు తెగించి జిత్తుల మారి నక్కలను కాపాడారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపల్లి గ్రామాల శివారులోని వ్యవసాయ బావిలో పడ్డాయి నక్కలు. తొర్తి గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో రెండు నక్కలు పడిపోయాయి. ఆహారం కోసం వ్యవసాయ భూముల్లోకి వచ్చిన నక్కలు వ్యవసాయ బావిలో జారి పడ్డాయి. వాటి అరుపులు విన్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అధికార యంత్రాంగం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.