తాజ్మహల్ లోపల గంగా జలంతో అభిషేకం నిర్వహించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఇందుకోసం కావాల్సిన గంగా జలాన్ని వాటర్ బాటిల్లో తెచ్చారు. శ్రావణ మాసం సందర్భంగా అభిషేకం నిర్వహించేందుకు ప్రయత్నించారు. షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉన్న తాజ్ మహల్లోని నేలమాళిగకు దారితీసే మూసి ఉన్న మెట్లపై ఒక వ్యక్తి గంగా జలాన్ని పోశాడు.